by సూర్య | Fri, Mar 22, 2019, 11:04 AM
బెంగళూరు : లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరబోనని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. మాండ్య నియోజక వర్గంనుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ను పోటీలోకి దింపడంపై కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. నిజమైన కాంగ్రెస్ నేతలు తన కుమారుడికి తమ మద్దతు ప్రకటించారని, జెడిఎస్ కార్యకర్తలు అతడి విజయానికి కృషి చేయగలరని నిఖిల్ను వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి కుమారస్వామి అన్నారు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.
Latest News