by సూర్య | Fri, Mar 22, 2019, 11:02 AM
చెన్నై : ఎన్నికల తేదీలను నిర్ణయించడం కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాయని, దీనిలో కోర్టులకు ఎలాంటి అధికారం ఉండదని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) మద్రాసు హైకోర్టుకు తెలియజేశారు. ఈ మేరకు సిఇఒ సత్యబ్రత సాహూ మద్రాసు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. వివిధ పండుగలు, కార్యక్రమాల నేపథ్యంలో తమిళనాడులో ఏప్రిల్ 18వ తేదీన జరుగనున్న పోలింగ్ తేదీని మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సిఇఒ కౌంటర్ దాఖలు చేశారు. ఎన్నికల క్యాలెండర్ నిర్ణయించే అధికారం ఎలక్షన్ కమిషన్దేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని సిఇఒ పేర్కొన్నారు.
Latest News