మ‌ళ్లీ కాబూల్‌లో బాంబుల మోత‌

by సూర్య | Thu, Mar 21, 2019, 10:51 PM

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరం మ‌రోమారు బాంబుల మోతతో మారుమోగింది. పెర్షియన్ వర్గీయులు పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్ళకు పాల్పడ్డారు. తమ మత సంప్రదాయాలకు వ్యతిరేకంగా పెర్షియన్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవడాన్ని జీర్ణించోకోలేని ఉగ్రవాదులు దాడులకు దిగినట్లు ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వానికి సమాచారం అందింది.
ఈ బాంబు పేలుళ్ల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కాబూల్ లోనలి కర్త్ ఏ సాఖీ ప్రార్థనా మందిరం సమీపంలో కొందరు మోర్టార్ బాంబులతో దాడులు చేశారు. దాడులు చేసిన వారిని అరెస్టు చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున మొహరించారు. 


 


 

Latest News

 
వైసీపీ నవరత్నాలకు పోటీగా కే.ఏ. పాల్ దశరత్నాలు Thu, May 02, 2024, 07:08 PM
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM