by సూర్య | Thu, Mar 21, 2019, 10:51 PM
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరం మరోమారు బాంబుల మోతతో మారుమోగింది. పెర్షియన్ వర్గీయులు పెద్ద ఎత్తున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఉగ్రవాదులు బాంబు పేలుళ్ళకు పాల్పడ్డారు. తమ మత సంప్రదాయాలకు వ్యతిరేకంగా పెర్షియన్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవడాన్ని జీర్ణించోకోలేని ఉగ్రవాదులు దాడులకు దిగినట్లు ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వానికి సమాచారం అందింది.
ఈ బాంబు పేలుళ్ల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కాబూల్ లోనలి కర్త్ ఏ సాఖీ ప్రార్థనా మందిరం సమీపంలో కొందరు మోర్టార్ బాంబులతో దాడులు చేశారు. దాడులు చేసిన వారిని అరెస్టు చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున మొహరించారు.
Latest News