by సూర్య | Thu, Mar 21, 2019, 10:35 PM
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి,తహశీల్దార్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.వైసీపీ కి ప్రజలు భారీగా మద్దతు తెలువుతున్నారని,రాబోవు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం కాయమన్నారు.ఆయన వెంట ఆత్మాకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి అల్లుడు ఆదాల వంశీకృష్ణ రెడ్డి,కుమార్తె రచన తదితరులు పాల్గొన్నారు
Latest News