by సూర్య | Thu, Mar 21, 2019, 10:15 PM
ఎన్నికల హడావిడి నేపధ్యంలో అంతా అనుకున్నట్టే ఏపిలో తెలుగుదేశం నేతల ఇళ్లపై ఐటి దాడులు జరగొచ్చన్న కథనాలకు రూపం లభించింది. ఈ క్రమంలోనే గురువారం నెల్లూరు లోని మంత్రి నారాయణ నివాసం, నారాయణ మెడికల్ కాలేజీలో ఐటీ అధికారులు 5 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. కేంద్రం దాడులకు దిగి బెదిరించాలని చూసినా తాము వెనక్కి తగ్గే ప్రశ్నలేదని నేతలు చెపుతున్నారు. కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత టీడీపీ నాయకుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారంటూ నారాయణ తన ఎన్నికల ప్రచార సభలలో బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Latest News