మంగళగిరిలో లోకేశ్ ఎన్నికల ప్రచారం

by సూర్య | Wed, Mar 20, 2019, 02:36 PM

అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, మంత్రి  నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు తాడేపల్లి టౌన్ లో  లోకేశ్ ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి టౌన్ 20 వ వార్డు లోని ఆంజనేయ స్వామి దేవాలయం లో లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శవరాజకీయ పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో నారా లోకేశ్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వడానికి ఇదేమైనా పేకాటా? అని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం కావాలన్నారు. వివేకానందరెడ్డి చనిపోతే తనకు బాధేసిందన్నారు. వివేకాను హత్య చేసి గుండెపోటుగా ప్రచారం చేశారని విమర్శించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM