by సూర్య | Wed, Mar 20, 2019, 12:26 PM
ముంబై ఉత్తర భారతదేశంలో హోలీని రెండు రోజుల పండుగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్ లేదా చోటీ హోలీ అని జరుపుకుంటారు. హోలీ పండుగను చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. హోలీ పండుగను ముంబై వాసులు వినూత్నంగా జరుపుకున్నారు. హోలికా అనే రాక్షసి పేరుతో జైష్-ఏ- మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్, యువతను పట్టిపీడిస్తున్న పాపులర్ ఆన్లైన్ గేమ్ పబ్జీ దిష్టిబొమ్మలను తయారు చేశారు. పండుగలో భాగంగా వాటిని కాల్చి వేశారు. అనంతరం రంగులతో హోలీ సంబరాలు చేసుకున్నారు.
Latest News