by సూర్య | Wed, Mar 20, 2019, 10:42 AM
ముంబై : ముంబైలోని పలు స్టేషన్లలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఒబి)లను తొలగించాలని సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ముంబైలోని భందూప్, కుర్లా, విఖ్రోలి, దివ, కళ్యాణ్ జంక్షన్ల వద్ద ఉన్న ఎఫ్ఒబిలను తొలగించాలని నిర్ణయించారు. ఇటీవల ఛత్రపతి శివాజి మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్నుంచి ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ మధ్య ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరొక 34 మంది గాయపడ్డారు.
Latest News