భార్యను హత్య చేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

by సూర్య | Wed, Mar 20, 2019, 10:39 AM

రాయ్‌పూర్ : ఎన్నికల విధులకు వెళ్లొద్దని అడ్డుకున్నందుకు భార్యను సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ హత్య చేశాడు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఈ నెల 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కానిస్టేబుల్ గురువీర్ సింగ్ జగదల్‌పూర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే ఈ నెల 17న ఎన్నికల విధులకు కానిస్టేబుల్ వెళ్లాలి. ఎన్నికల విధులకు వెళ్లొద్దని 16వ తేదీ రాత్రి కానిస్టేబుల్‌తో భార్య అనుప్రియ గౌతమ్ గొడవ పడింది. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేశాడు కానిస్టేబుల్. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. తన భార్య ఆత్మహత్య చేసుకుందని గురువీర్ సింగ్ తెలిపాడు. మొత్తానికి పోలీసులు విచారణ చేపట్టగా అనుప్రియను కానిస్టేబులే చంపినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM