by సూర్య | Tue, Mar 19, 2019, 11:36 AM
అమరావతి: ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ఏపీ సీఎం, టీడీపీ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పీడు పెంచేశారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్న ఆయన ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన టీడీపీ అధినేత.. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు.
రెండు రోజులుగా ఆయన పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తూ.. టీడీపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన నేడు మరో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల సన్నాహక సభల కోసం ఆయన మంగళవారం కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత సేవామిత్ర, బూత్ కన్వీనర్లతో సమావేశం కానున్నారు
Latest News