1.65 లక్షల కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి : సిఎస్ పునేఠ

by సూర్య | Tue, Mar 19, 2019, 01:48 AM

రాష్ట్రంలో అత్యంత కరువు జిల్లాలైన అనంతపురం, కర్నూల్, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని లక్షా 65వేల కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత పధకం (పల్లెజీవం) ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అమరావతి సచివాలయంలో ఎపి డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు ప్రాంత జిల్లాల్లోని కుటుంబాలను ఆర్ధికంగా, సామాజికంగా అన్ని విధాలా అభివృద్ధిలోకి తీసుకురావ‌డంతో పాటు వారి జీవన ప్రమాణాలను పూర్తిగా మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు నుండి పంటలను కాపాడడానికి అనుకూలమైన నీటిపారుదల పద్ధతులు, మెరుగైన భూసార పరిరక్షణ, కరువును తట్టుకునే విధంగా పంట రకాలు, ఉద్యానవన పంటలకై మెరుగైన పద్ధతుతుల‌ను ప్రోత్స‌హించాలని అధికారులకు సూచించారు. వర్షపునీటి నిల్వద్వారా మరింత నీటిని అందుబాటులోకి తీసుకుని భూగర్భ జలాలు రీచార్జ్ చేయడం, వాతావరణం, మార్కెట్, పంటల ఎంపిక గురించి సమాచారం అందించేకు కృషి చేయాలని సిఎస్ పునేఠ ఆదేశించారు.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM