తుపాను ప్రభావంతో ప్రజలకి సూచనలు ఇచ్చిన విపత్తుల నిర్వహణ సంస్థ

by సూర్య | Wed, Oct 23, 2024, 08:17 PM

దానా తుపాను ప్రభావం నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రజలు కింద సూచించిన జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 


సూచనలు:


1. భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.


2. ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి. అలాంటి చెట్ల కింద ఉండవద్దు.


3. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకులు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి.


4. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.


5. కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండండి.


6. ప్రయాణంలో ఉన్నట్టయితే వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోండి.


 

Latest News

 
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి Thu, Oct 24, 2024, 09:46 PM
రాజకీయ లబ్ధి కోసమే ఈ పరామర్శలు Thu, Oct 24, 2024, 09:42 PM
అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌ Thu, Oct 24, 2024, 09:41 PM