అనారోగ్య సమస్యలతో ఒకేరోజు అన్నదమ్ములు మృతి

by సూర్య | Wed, Oct 23, 2024, 08:06 PM

రాయదుర్గం మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు శ్రీనివాసులునాయుడు, గిరిధర్‌నాయుడు మంగళవారం ఒకే రోజున మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాశీపురం గ్రామానికి చెందిన జటింగనాయుడుకు శ్రీనివాసులు నాయుడు, సత్తెన్న, గిరిధర్‌ నాయుడు ముగ్గురు కుమారులు. వారిలో సత్తన్న కిడ్నీ సమస్యతో ఐదేళ్ల క్రితం మరణించారు. ఇదిలాఉండగా కొద్దిరోజుల నుంచి శ్రీనివాసులు నాయుడు కిడ్నీ సమస్యతో బాధపడుతూ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


అయితే తమ్ముడు గిరిధర్‌నాయుడు నాలుగు రోజుల క్రితం గ్యాసి్ట్రక్‌ సమస్యతో అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం తెల్లవారుజామున గిరిధర్‌ నాయుడు మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని కాశీపురానికి తీసుకొచ్చారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులు నాయుడికి తమ్ముడు మృతి విషయం తెలియడంతో మధ్యాహ్నం సమయంలో ఆయన కూడా హఠాత్మరణం చెందాడు. అన్నదమ్ముల్దిరూ ఒకే రోజు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest News

 
ఏపీలో పింఛన్‌లపై మరో శుభవార్త.. ఇకపై చాలా ఈజీగా, ఆరంచెల విధానం రద్దు Sat, Oct 26, 2024, 09:29 PM
ఆ తండ్రిని చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి.. ఆ రెండు వంటలు బాగా చేస్తా: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు Sat, Oct 26, 2024, 09:27 PM
బయటకు వచ్చిన మరో లెటర్.. చెల్లెలు షర్మిలకు జగన్ భావోద్వేగ లేఖ Sat, Oct 26, 2024, 09:26 PM
కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే కోండ్రు Sat, Oct 26, 2024, 08:57 PM
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Sat, Oct 26, 2024, 08:40 PM