ప్రమాదవశాత్తు లోయలో పడిన బస్సు, పలువురికి గాయాలు

by సూర్య | Wed, Oct 23, 2024, 08:05 PM

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పులివెందుల సమీపంలో అదుపుతప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు 30అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించపోయిన బస్సు ప్రమాదవశాత్తూ 30అడుగల లోయలో పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే లోయ వద్దకు పరుగులు పెట్టారు.


సమాచారాన్ని పోలీసులకు అందించగా వారూ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసులు కలిసి బస్సులోని వారిని బయటకు తీశారు. గాయాలపాలైన బాధితులను హుటాహుటిన పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM