గ్రామీణ రోడ్లని గుర్తించాలి

by సూర్య | Fri, Jul 26, 2024, 11:55 PM

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రోచ్‌ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కర్నూలు కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులతో రోడ్ల నిర్మాణంపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెండు కి.మీ లోపు అప్రోచ్‌ రోడ్డు వేయని గ్రామాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. ఆర్‌అండ్‌బీ కింద గుంతలు ఉన్న 39 రోడ్లకు మరమ్మతులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా పథకాల కింద చేయాల్సిన పనులను ఐడెంటిఫై చేసి వెంటనే ప్రతిపాదనలు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, ఈఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM