by సూర్య | Fri, Jul 26, 2024, 09:55 PM
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని మానేపల్లి గ్రామానికి చెందిన టి ఆదిలక్ష్మి 108 వాహనంలో ప్రసవం జరిగింది. సిబ్బంది తెలిపిన వివరాల మేరకు కాన్పు కోసం 108 వాహనంలో ఎర్రగొండపాలెం వైద్యశాలకు వస్తున్న సమయంలో రామసముద్రం సమీపంలో నొప్పులతో బాధపడుతుండగా సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నట్లు వెన్నా గాలిరెడ్డి, దుపాటి శ్రీను తెలిపారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Latest News