by సూర్య | Fri, Jul 26, 2024, 02:52 PM
భామిని మండలంలో ఈనెల 27 వ తేదీ శనివారం భామిని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండలి బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ రావడ కిశోర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని సూచించారు. గత బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఎంత మేరకు అమలు చేశాం అనే అంశం పై చర్చ, కొత్త నిర్ణయాలు పై తీర్మానం చేస్తామన్నారు.
Latest News