జగన్ కీలక నిర్ణయం!?

by సూర్య | Fri, Jul 26, 2024, 12:30 PM

ఏపీలో కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత.. గత ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ పై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ.. జగన్ సర్కార్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ 50 రోజుల్లో ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్! ఇందులో శాంతిభద్రతలు అనేవీ మరీ హాట్ టాపిక్ గా మారాయి! కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించింది. ఇదే క్రమంలో... వివిద జాతీయ పార్టీల నాయకులు, ఎంపీలు జగన్ కు మద్దతుగా నిలవడంతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఈ సమయంలో జగన్ కూడా ఆ జోష్ తగ్గించకూడదని భావిస్తున్నారు.ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, ఫలితంగా వైసీపీ క్యాడర్ యాక్టివ్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాలన, 2019-24 కొనసాగిన తన పాలన పనితీరుపై అంశాలవారీగా స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది . ఈ సమావేశంలోనే జగన్ కొన్ని కీలక ప్రకటనలు చెయబోతున్నారని.. ఇండియా కూటమి టాపిక్ కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది!

Latest News

 
పల్లె పండుగలో పాల్గొన్న పరిటాల సునీత Thu, Oct 17, 2024, 10:57 PM
న్యాయం చెయ్యండంటూ బైఠాయించిన మహిళా Thu, Oct 17, 2024, 10:57 PM
రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి Thu, Oct 17, 2024, 10:56 PM
కూన రవికుమార్‌తో నాకు ప్రాణహాని ఉంది అంటున్న మరోనేత Thu, Oct 17, 2024, 10:55 PM
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చెయ్యండి Thu, Oct 17, 2024, 10:54 PM