పైడిమాంబ దేవాలయానికి గుడ్ న్యూస్

by సూర్య | Thu, Jul 25, 2024, 11:23 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం.. సిరుల తల్లి పైడిమాంబ దేవస్థానం (చదురుగుడి) అభివృద్ధికి రూ.25 కోట్లతో డీటైల్డు ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. గత నెలలో దేవదాయ శాఖ నుంచి ప్రముఖ ఇంజనీర్లు వచ్చి చదురుగుడి వద్ద కొలతలు తీసుకుని వెళ్లారు. కొత్త ప్రణాళిక ప్రకారం శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్‌, తలనీలాలు సమర్పించే గది ఏర్పాటు చేస్తారు. మరో 50 ఏళ్ల వరకూ దేవస్థానం విస్తరించే పనిలేకుండా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. డీపీఆర్‌ ప్రకారం అంతరాలయం పూర్తిగా విస్తరించనున్నారు. ప్రస్తుతం భక్తులు దర్శించుకునే క్యూలైన్లు మూడు వున్నాయి.. ఒకటి ఉచిత దర్శనం.. రెండోది ప్రత్యేక దర్శనం (రూ.20 లేదా రూ.50 టిక్కెట్‌), మూడోది వీఐపీల లైను. ఈ మూడూ విశాలం కానున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వున్న దుర్గాదేవి ఆలయం మాదిరిగా ఎంత మంది క్యూలో వున్నా దర్శనం కోసం వేచి వుండకుండా నేరుగా భక్తులు దర్శనం చేసుకుని వెళ్లేలా డీపీఆర్‌ రూపొందించారు. మరోవైపు ఆలయానికి ఆనుకుని (పాత సీటీస్కాన్‌) తాత్కాలికంగా అన్నదాన మండపం ఏర్పాటు చేశారు. భక్తులు దర్శనం చేసుకున్న తరువాత ప్రసాదం తీసుకుని నేరుగా అన్నదానానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వీఐపీలు వచ్చినప్పుడు పూజానంతరం వేదాశీర్వచనం అందించేందుకు వీలుగా ప్రత్యేక మండపం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM