by సూర్య | Thu, Jul 11, 2024, 10:50 AM
దోర్నాల నుండి శ్రీశైలం వరకు నడక మార్గంలో చేరుకొని రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ గురువారం ఇష్ట కామేశ్వరి, శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. రైల్వే కోడూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని 50కిమీ పాదయాత్ర చేసి మహా శివుని ఆశీర్వాదాలు తీసుకున్నానని ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.
Latest News