by సూర్య | Wed, Jul 10, 2024, 04:06 PM
ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రోడ్లకు మహర్దశ కల్పించాలని కోరుతూ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని కూటమి ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు బుధవారం విజయవాడ ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో రోడ్ల సమస్యలను గాలికి వదిలేసిన సంగతిని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్పందిస్తూ తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Latest News