by సూర్య | Fri, Apr 26, 2024, 06:45 PM
నరసాపురం అసెంబ్లీ స్ధానానికి మొత్తం 14 మంది అభ్యర్ధులు 25 సెట్ల నామినేషన్లు వేశారు. వీరిలో నాయకర్ల పేర్లపై ముగ్గరు అభ్యర్ధులు ఉన్నారు. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్తో పాటు జాతీయ జనసేన పార్టీ అభ్యర్ధిగా పాలెపు సత్యలింగ నాయకర్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొల్లి సత్య నాయకర్లు ఉన్నారు. వీరిలో పాలెపు సత్యనాయకర్ స్వస్థలం కాకినాడ పట్టణం కాగా, కొల్లి సత్యనాయకర్ స్వస్థలం నరసాపురం పట్టణంలోని 3వ వార్డుకి చెందిన వాడుగా నామినేషన్ పత్రంలో చూపించారు. బ్యాలెట్లో ముగ్గురు నాయకర్ పేర్లు ఉంటే ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవశాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరి పార్టీలు, గుర్తులు వేరైనా పేర్లు కారణంగా కన్ప్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కావాలనే ఏవరైనా వీరితో నామినేషన్లు వేయించారా ? అని పలువరు చర్చించుకుంటున్నారు.
Latest News