రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం

by సూర్య | Fri, Apr 26, 2024, 06:44 PM

అభివృద్ధి సంక్షేమమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం ఏడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చూట్టారు. ఆత్రేయపురం, వసంతవాడలో వైసీసీ సీనియర్‌ నాయకుడు పేరిచర్ల జగ్గరాజు, వాడపల్లిలో సీనియర్‌ వైసీపీ నాయకుడు యేపుగంటి దుర్గారావులు తమ అనుచరులతో ప్రజాగళం ప్రచారయాత్రలో టీడీపీలో చేరారు. వారందరికి బండారు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు చేయడంతో పాటు యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కృషిచేస్తామన్నారు. అవినీతి ప్రభుత్వం పోవాలంటే సైకిల్‌ ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, మెర్లపాలెం సర్పంచ్‌ మెర్ల రాము, అల్లు వెంకటరమణ, దొడ్డపనేని వెంకట్రావు, దండు రాంబాబు పాల్గొన్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM