అదృశ్యం కేసుని ఛేదించిన పోలీసులు

by సూర్య | Fri, Apr 26, 2024, 03:19 PM

తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య అదృశ్యం కేసులో జగ్గయ్యపేట పోలీసులు ముందడుగు వేశారు. గురువారం జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండల పరిధిలో ఒక కర్మాగారం గోడ పక్కన నిలిపిన కారును గుర్తించారు. ఎల్లయ్య ఈ నెల 18న ఒక కేసులో మధ్య వర్తిత్వానికి అపర్ణ అనే మహిళతో టీఎస్‌.29 బి 9495 నెంబరు కారులో జగ్గయ్యపేట రావటం, డబ్బులిస్తానని శ్రీనివాస్‌ అనేవ్యక్తి కారులో తీసుకెళ్లటం, ఆ తర్వాత అపర్ణ కూడా అదృశ్యం కావటం, ఎల్లయ్యతో వచ్చిన స్నేహితుడు అంజయ్య కుటుంబ సభ్యులకు తెలియజేయటంతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీసులు నిందితుల కోసం తొమ్మిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా గురువారం కర్మాగారం సమీపంలో కారు ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావటంతో వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితం అదృశ్యం కాగా కారు ఇప్పుడు వెలుగులోకి రావటం, తాజాగా కారు ఇప్పుడే ఉంచారా? లేదా అప్పటి నుంచి హైవేపై ఉంటే ఎందుకు పోలీసులు గమనించ లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే కేసు మిస్టరిని ఛేదిస్తామని జగ్గయ్యపేట పోలీసులు చెబుతున్నారు. కారు సూర్యాపేటకు చెందిన కలప వ్యాపారిదిగా చెబుతున్నారు.

Latest News

 
నేటి పంచాంగం 08-05-2024 Wed, May 08, 2024, 10:43 AM
జగన్ను గెలిపించండి: లక్ష్మీ భార్గవి Wed, May 08, 2024, 10:39 AM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 10:39 AM
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM