సూపర్ సిక్స్ పథకాలు అమలుచేస్తాం

by సూర్య | Fri, Apr 26, 2024, 03:13 PM

కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు. మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలోని 2, 3 వార్డులలో ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంతకు మహిళలు హారతులు పడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తున్నారు. ఎమ్మెల్యే వసంతతో పాటు ప్రచారంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Latest News

 
ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజలవద్దకు వచ్చిన నాయకుడు జగన్ మాత్రమే Wed, May 08, 2024, 07:59 PM
చంద్ర‌బాబు దృష్టిలో పేద‌లంటే ఐదేళ్ల‌కోసారి ఓట్లు అమ్ముకునే జీవ‌శ్చ‌వాలు Wed, May 08, 2024, 07:58 PM
సింహపురి రాజకీయాల్లో అనూహ్య మార్పులు.. 10 స్థానాల బరిలో ఎవరెవరు Wed, May 08, 2024, 07:58 PM
టీడీపీ ఆగడాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి Wed, May 08, 2024, 07:58 PM
ఏపీ ఎన్నికల్లో ఈ జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 16 స్థానాల బరిలో ఎవరెవరు Wed, May 08, 2024, 07:49 PM