దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించవద్దు

by సూర్య | Sat, Apr 13, 2024, 09:47 PM

దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించ వద్దంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆమె లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు కలిసి సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు సూచించినట్లు తెలిసిందని చెప్పారు. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను ఏనాడూ వినియోగించుకోలేదని గుర్తుచేశారు. ఈ విషయంలో గతంలో ఎన్నికల విధుల్లో పనిచేసిన అధికారుల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదాయ శాఖ సిబ్బంది సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీగా పరిపాలనా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. పరిపాలనలో ఏదైనా అంతరాయం ఏర్పడితే భక్తులు ఇబ్బందులు పడతారన్నారు. ఆలయాల్లో నిర్ధిష్ట విధులను, ఆగమ శాస్త్ర మార్గదర్శకాలను ఆమోదించడం ద్వారా వాయిదా వేయలేరని చెప్పారు.

Latest News

 
అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం, విద్యార్ధులకి గాయాలు ఆసుపత్రికి తరలింపు Tue, Feb 18, 2025, 12:07 PM
ముద్రగడకి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించిన పోలీసులు Tue, Feb 18, 2025, 12:02 PM
తునిలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం Tue, Feb 18, 2025, 11:59 AM
చంద్రబాబు, లోకేశ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అంటే ఇదేనా? Tue, Feb 18, 2025, 11:57 AM
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల Tue, Feb 18, 2025, 11:54 AM