అన్ని వర్గాలను జగన్ మోసం చేసాడు

by సూర్య | Sat, Apr 13, 2024, 09:37 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్య నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రజలను సైకో జగన్ జలగల్లా పీల్చుతున్నారని బహిరంగ సభలో ఫైర్ అయ్యారు. తల్లి, చెల్లిని రోడ్డుపైకి తీసుకువచ్చి సొంత బాబాయ్ ను హత్య చేసిన వారిని కాపాడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో చంద్రబాబు సాగునీరు పారిస్తే జగన్ మాత్రం రక్తం పారిస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ తో అన్ని వర్గాలను నిండా ముంచారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న బాలకృష్ణ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు.

Latest News

 
గిరిజనులకు అండగా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ Tue, Jan 21, 2025, 10:00 PM
పాఠశాలలకు రూ. 2,01,116 చెక్కు అందించిన ఎమ్మేల్యే Tue, Jan 21, 2025, 09:58 PM
ఛత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ Tue, Jan 21, 2025, 09:56 PM
ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలన Tue, Jan 21, 2025, 09:54 PM
పరిటాల రవీంద్ర వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున ఎమ్మెల్యే Tue, Jan 21, 2025, 09:42 PM