బాపట్ల, రేపల్లె నియోజకవర్గాలలో చంద్రబాబు సమీక్ష

by సూర్య | Sat, Apr 13, 2024, 04:47 PM

 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు. మొదట రేపల్లె నియోజకవర్గం నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేసుకుంటున్నారు. అధికార వైసీపీని ఎన్నికల్లో ఎలా ఢీకొట్టాలనే అంశంపై కూటమి నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ నేతలు ప్రచారం చేయాలని సూచించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM