అది ప్రజకూటమి కాదు, కాలకూట విష కూటమి

by సూర్య | Sat, Apr 13, 2024, 04:06 PM

‘నారా డిజాస్టర్‌ అలయెన్స్‌’గా ఏపీ ఎన్డీఏ మానింద‌పి వైయ‌స్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అభివ‌ర్ణించారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరిల కాలకూట విష కూటమి అది అని చెబుతున్నారని తెలిపారు. విశాఖపట్టణంలోని తన కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర‌ అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి మీడియాతో  మాట్లాడుతూ..... ఎన్నికలు జరుగుతున్న తరుణమిది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలంతా జగనన్నకు మళ్లీ ఓట్లేసి.. ఆయన్నే మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఇప్పటికే డిసైడ్‌ అయి ఉన్నారు. ఎవరెన్ని కూటములు కట్టినా ప్రజలు మాత్రం 2024 వన్స్‌మోర్‌ అంటూ.. జగనన్న వైపే ఉన్నారు. దానికి నిదర్శనంగా మనం జగనన్న బస్సుయాత్రకు వస్తోన్న స్పందనను చూస్తున్నాం. మండుటెండ లను సైతం లెక్కచేయకుండా కాళ్లు కాలుతున్నప్పటికీ ప్రజలు తండోప తండాలుగా జగనన్నకు ఎదురొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న గుంటూరులో వర్షంలో తడుస్తూ కూడా జనం బారులు తీరి మరీ.. జగనన్న బస్సు యాత్రకు మద్ధతుపలికారు. ఐదేళ్ల పరిపాలనలో జనం మేలు కోరిన జగనన్నను చూడాలని.. ఆయనకు తమ మద్ధతు ప్రకటించాలని మహిళలు, వృద్ధులు, చిన్నారులతో సహా అందరూ ఊరూరా తరలిరావడం చూస్తున్నాం అని అన్నారు. 

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM