by సూర్య | Fri, Apr 12, 2024, 09:49 PM
అస్సాంలోని డిబ్రూగఢ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును నిర్భంధించలేరన్నారు. బీజేపీ అబద్ధాలు చెబుతూనే ఉందని, ఇది ఎంతోకాలం కొనసాగదని ప్రజలు గ్రహించారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసే ఆలోచనలు ఢిల్లీ, పంజాబ్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
Latest News