by సూర్య | Fri, Apr 12, 2024, 06:27 PM
ఎన్నికల్లో పోలింగ్ బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలి అని..అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పోలింగ్ బూత్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ మంచి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
Latest News