అనుమానాస్పదంగా భార్యాభర్తలు ఆత్మహత్య

by సూర్య | Fri, Apr 12, 2024, 06:25 PM

భీమవరానికి చెందిన బొంతు కిషోర్‌ కుమార్‌ (32), అతని భార్య యోచన, రెండేళ్ల కుమార్తె నిధిశ్రీ చించినాడ బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకారని భర్త మృత దేహం లభ్యమైనట్టు ఎస్‌ఐ కె.శివన్నా రాయణ తెలిపారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కిషోర్‌ కుమార్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం కిషోర్‌ సోదరుడు ఉదయ కిరణ్‌ అతనికి ఫోన్‌ చేయగా ఎవరో ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ఈ మొబైల్‌ చించి నాడ బ్రిడ్జిపై ఉందని, దీంతోపాటూ బ్యాగ్‌, చెప్పులు ఉన్నాయని చెప్పారు. దీంతో వెంటనే అతని బంధువులు బ్రిడ్జి వద్దకు చేరుకుని ఆ వస్తువులు కిషోర్‌కు చెందినవిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిషోర్‌ కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు గురువారం గోదావరిలో గాలించగా సాయంత్రం కిషోర్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. అతని భార్య, కుమార్తెల ఆచూకీ లభ్యం కాలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపి వేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఎస్‌ఐ తెలిపారు.శుక్రవారం ఉదయం గాలింపు కొనసాగిస్తామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. రేపే ఆ కోటా టికెట్లు విడుదల Wed, Oct 23, 2024, 11:18 PM
విశాఖలో క్యాంపస్ ఏర్పాటు.. ప్లాన్ మార్చిన టీసీఎస్!.. అక్కడేనా? Wed, Oct 23, 2024, 10:18 PM
షర్మిల, విజయమ్మకు షాకిచ్చిన వైఎస్ జగన్..ఎన్సీఎల్టీలో పిటిషన్, ఆ కంపెనీ షేర్ల కోసం! Wed, Oct 23, 2024, 10:16 PM
జగన్ మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు.. ఆ ఒక్క కారణంతో వైసీపీకి రాజీనామా చేశా: వాసిరెడ్డి పద్మ Wed, Oct 23, 2024, 10:13 PM
చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన వెంకయ్యనాయుడు Wed, Oct 23, 2024, 10:05 PM