by సూర్య | Fri, Apr 12, 2024, 06:17 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో ఆ నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టిసారించారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంలోకి వెళుతున్నారు. అధికార వైసీపీ నేతలకు షర్మిల పర్యటన కంటగింపుగా మారింది. షర్మిల శుక్రవారం నాడు లింగాల మండలానికి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. షర్మిల పర్యటనను అడ్డుకోవాలని చూశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. అల్లరి చేసే వాళ్లు పులివెందుల రండి. పూల అంగళ్ళ వద్ద పంచాయితీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం అని షర్మిల కోరారు.
Latest News