వినియోగదారుల ఫోరంలో మహిళ పోరాటం.. పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి రూ.2.13 లక్షల పరిహారం

by సూర్య | Tue, Nov 21, 2023, 07:01 PM

నెల్లూరు జిల్లా వినియోగదారుల ఫోరం కీలక తీర్పును ఇచ్చింది. ఓ మహిళకు రూ.2.13 లక్షల పరిహారం చెల్లించాలని తపాలాశాఖను ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. కావలికి చెందిన అనుమకొండ వెంకటరత్నమ్మ 2020 మార్చి 23న తపాలా ఏజెంట్‌కు రూ.30 లక్షలకు చెక్కు ఇచ్చారు. ఏడాదికి 7.7 శాతం వడ్డీతో ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా తెరవమని చెప్పారు. అదే రోజు అకౌంట్ తెరుస్తానని ఏజెంట్‌ చెక్కును కావలి పోస్టుమాస్టర్‌కు అందజేశారు. అనంతరం ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో ఏప్రిల్‌ 2న బాధితురాలు తపాలా శాఖకు ఫిర్యాదు చేశారు.


అక్కడ డాక్యుమెంట్ల ధ్రువీకరణ తర్వాత మార్చి 30న చెక్కును పోస్టుమాస్టర్‌ బ్యాంకుకు పంపారని.. ఏప్రిల్‌ 2న డబ్బు తపాలా శాఖ అకౌంట్‌కు జమ అయినట్లు పోస్టుమాస్టర్‌ ఏప్రిల్‌ 28న సమాధానం ఇచ్చారు. కేంద్రం ఏప్రిల్‌ 1న వడ్డీని 7.7 నుంచి 6.7 శాతానికి తగ్గించిందని.. ఏప్రిల్‌ 2న డబ్బు జమవడంతో అదే రోజున తగ్గిన వడ్డీ శాతం ప్రకారం ఖాతా తెరిచామని పేర్కొన్నారు. మార్చి 23నే చెక్కు అందించానని.. 7.7 శాతం వడ్డీతో ఖాతా ఉండాలని అభ్యర్థించినా పట్టించుకోలేదంటూ బాధితురాలు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.


కరోనా కారణంగా సగం మంది సిబ్బంది విధులకు హాజరుకావడంతో చెక్కును ఆలస్యంగా బ్యాంకుకు పంపించారన్నారు. ఏప్రిల్‌ 2న జమ కావడంతో అదే రోజు అకౌంట్‌ తెరిచామని.. తమ తప్పు లేదని తపాలా శాఖ తరఫు న్యాయవాది వాదించారు. కేసును విచారణ చేసిన న్యాయమూర్తి.. ఏప్రిల్‌ 2 వరకు జమ చేయకపోవడం తపాలా శాఖ సేవా లోపమన్నారు. ఇందుకు నష్టపరిహారంగా రూ.1,58,247.. బాధితురాలి మానసిక ఆవేదనకు రూ.50 వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM