by సూర్య | Mon, Mar 20, 2023, 01:07 PM
బీసీ వర్గానికి చెందిన సభాపతిపై టీడీపీ ఎమ్మెల్యేలు సభలో దాడి చేశారు. ఆయనపై చేయి చేసుకున్నారని, ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్ డే అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు. స్పీకర్, దళిత ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన టీడీపీ శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. శాసనసభలో స్పీకర్ పై టీడీపీ సభ్యుల దౌర్జన్యం, అడ్డుకున్నందుకు ప్రయత్నించిన వైయస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యేలపై దాడి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.
Latest News