by సూర్య | Mon, Mar 20, 2023, 02:03 PM
శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామి పై దాడిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు’ అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. సీఎం జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే ఇవాళ దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారన్నారు. సోమవారం సభలో జరిగిన ఘటనతో ముఖ్యమంత్రి జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సిఎంగా నిలిచిపోతారని, స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్కు పిచ్చెక్కి ఇలా వ్యవహరించారని, ఇది శాసన సభ కాదు...కౌరవ సభ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Latest News