by సూర్య | Mon, Mar 20, 2023, 09:37 AM
రైతుల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడుకనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఇవాళ లక్షల మంది రైతులు హస్తిన చేరుకోనున్నారు. రామ్లీలా మైదానంలో నేడు ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించనున్నట్లు సంయుక్త్ కిసాన్ మోర్చా నేతలు వెల్లడించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరగనుంది.
Latest News