by సూర్య | Mon, Mar 20, 2023, 09:27 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండి క్యూలైన్ బయటకు వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. ఆదివారం శ్రీవారిని 81,700 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 27,982 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Latest News