ఈ నెల 21, 22 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:20 PM

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతి శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ క్రమంలో ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని తెలిపారు. ఈ నెల 22న తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవి అలంకారం చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీవారు విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. బంగారు వాకిలిలో ఆగమ పండితులు, పురోహితులు ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
ఎన్నికలకు సిద్దంగా ఉన్నాం: డీకే శివకుమార్ Wed, Mar 29, 2023, 09:04 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Wed, Mar 29, 2023, 08:51 PM
వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం Wed, Mar 29, 2023, 08:48 PM
రాష్ట్రం నీ అబ్బ సొత్తా... జగన్ పై మండిపడ్డిన వైసీపీ రెబల్ ఎంపీ Wed, Mar 29, 2023, 08:40 PM
ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్: కొడాలి నాని Wed, Mar 29, 2023, 08:38 PM