ఈ నెల 21, 22 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:20 PM

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతి శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ క్రమంలో ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని తెలిపారు. ఈ నెల 22న తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవి అలంకారం చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీవారు విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. బంగారు వాకిలిలో ఆగమ పండితులు, పురోహితులు ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM