అతివేగంగా వచ్చి బస్సు లోయలో పడిపోయింది

by సూర్య | Sun, Mar 19, 2023, 07:48 PM

అతివేగం కారణంగా ఓ బస్సు లోయలోపడిన ఘటన  బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయి... గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో జరిగిందీ ప్రమాదం.


సోనాదంగా నుంచి ఢాకాకు ఈ బస్సు బయల్దేరింది. ఉదయం 7.30 సమయంలో మదారిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌ వేపై అదుపుతప్పి కాలువలోకి వేగంగా దూసుకెళ్లింది. కాలువ గోడను ఢీకొని ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని... స్థానిక ప్రజలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.


డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం, బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వేగానికి బస్సు టైర్ పగిలిపోయిందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కాలువలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM