ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటుకు ఇది నిదర్శనం: చంద్రబాబు

by సూర్య | Sun, Mar 19, 2023, 03:55 PM

పట్టభద్రుల ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డి గెలుపు ప్రజావిజయం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ప్రజాతీర్పును ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని చంద్రబాబు వివరించారు. చైతన్యం, బాధ్యతతో వచ్చి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారని తెలిపారు. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండ్రోజులు ముందే చెప్పారని చంద్రబాబు చమత్కరించారు. 


ఈ నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన చేశారని విమర్శించారు. జగన్ ఎన్నికల్లో మళ్లీ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జగన్ బాధ్యతలేని వ్యక్తి అని, మోసాలు చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, టీడీపీది జనబలం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ది ధనబలం అని, రౌడీయిజం చూపిస్తున్నాడని... ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. జగన్ అక్రమాలను నమ్మి వాటితోనే ముందుకు వెళుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెట్టి వేధించారని తెలిపారు.


Latest News

 
పన్నులు చెల్లించి నగర అభివృద్ధి కోసం సహకరించండి Thu, Feb 12, 2026, 03:46 PM
పుష్ప స్టైల్లో 'తగ్గేదేలే' అంటున్న అంబటి రాంబాబు Thu, Feb 12, 2026, 03:22 PM
ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం Thu, Feb 12, 2026, 03:19 PM
కొలికపూడి శ్రీనివాస్‌ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు Thu, Feb 12, 2026, 03:17 PM
పవన్ కల్యాణ్‌ను కలిసిన బాలకృష్ణ Thu, Feb 12, 2026, 03:13 PM