ఢిల్లీలోని మంగోల్పురి‌లో వేధింపులకు గురైన యువతి,,,వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు

by సూర్య | Sun, Mar 19, 2023, 03:15 PM

దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత నేటీకి ప్రశ్నార్థకంగానే మారింది. తాజాగా పట్టపగలు నడివీధిలో ఓ యువతి వేధింపులకు గురయ్యింది. బాధిత యువతిని జుట్టుపట్టుకుని ఓ యువకుడు కారులోకి లాక్కెళ్తున్నా చుట్టూ ఉన్నవారు చోద్యం చూశారు. తప్పా ఒక్కరంటే ఒక్కరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సంచలనంగా మారిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగోల్‌పురి ప్రాంతంలోని ఫ్లైఓవర్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. తొలుత బాధిత యువతి క్యాబ్‌లోంచి దిగిపోయింది.. అయితే.. అదే కారులో ఉన్న ఓ యువకుడు వాహనం దిగుతున్న ఆమెను షర్ట్ పట్టి బలవంతంగా లోపలికి నెట్టాడు. ఆ సమయంలో లోపల మరో ఇద్దరు యువకులు ఉన్నారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరువైందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు స్పందించి, రంగంలోకి దిగారు.


ఔటర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ డీసీపీ మాట్లాడుతూ.. గత రాత్రి నుంచి వైరల్ అవుతోన్న వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. క్యాబ్ డ్రైవర్ అడ్రస్ కనుగొన్నామని, అతడితో పోలీసులు త్వరలో మాట్లాడతారని ఆయన వెల్లడించారు. ‘‘ఓ యువతి, ఇద్దరు యువకులు ఉబర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నారు.. రోహిణి నుంచి వికాస్‌పురి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కారు.. అయితే.. మార్గమధ్యంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఆ తరువాత యువతి కారు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.. ఈ క్రమంలో ఆ యువకుడు ఆమెను మెడపట్టి బలవంతంగా కారులోకి తోశాడు’’ అని తెలిపారు.


ప్రాథమిక విచారణలో గురుగ్రామ్ రత్నవిహార్‌లో కారు రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తించి, పోలీస్ బృందాన్ని అక్కడకు పంపామని చెప్పారు. అటు, వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వీడియోను షేర్ చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్.. ‘యువతిని వేధించి బలవంతంగా కారులోకి ఎక్కించిన వీడియోను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చాం... నిందితులపై మహిళా కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని ట్వీట్ చేశారు.


Latest News

 
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM
మాధవరం-1లో బస్సు, లారీ ఢీ Wed, Apr 24, 2024, 10:30 AM
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM