కరోనా సమయంలో బారికేడ్లు దాటాడని,,,రేండేళ్ల బాలుడిపై కేసు... పోలీసులను మందలించిన కోర్టు

by సూర్య | Sat, Mar 18, 2023, 09:27 PM

మన  దేశంలో కొన్ని కేసులను పరిశీలిస్తే మాత్రం ఆశ్చర్యానికి గురికాకతప్పదు. ఇదిలావుంటే కరోనా కాలంలో పెట్టిన ఓ కేసుకు సంబంధించి బెయిల్ కావాలంటూ నాలుగేళ్ల పిల్లాడు కోర్టును ఆశ్రయించాడు. ఆ పిల్లాడిపై నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసుకు సంబంధించి అరెస్టు, బెయిల్ కు ఎలాంటి నిబంధనలు లేవని తేల్చారు. కేసు లేదు, బెయిలూ లేదు పొమ్మన్నారు. బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన.


కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా వుండడంతో 2021 లో బెగుసరాయ్ జిల్లాలో పలు ప్రాంతాలను అధికారులు కంటైన్ మెంట్ జోన్లుగా మార్చారు. బారికేడ్లను పెట్టి రోడ్డును మూసేశారు. అయితే, స్థానికులు కొందరు ఈ బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అప్పటికి నిండా రెండేళ్లు కూడా లేని పిల్లాడిపైనా పోలీసులు కేసు పెట్టారు. బారికేడ్లను తొలగించి వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని ఆరోపించారు.


తన కొడుకుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందనే విషయం తల్లికి ఇటీవలే తెలిసింది. దీంతో బెయిల్ కోసం కొడుకును వెంటబెట్టుకుని బెగుసరాయ్ కోర్టును ఆశ్రయించింది. చిన్న పిల్లాడిపైన కేసేంటని పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసులను మందలించారు. వెంటనే ఆ పిల్లాడిపై కేసు కొట్టేయాలని ఆదేశించారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM