లోకేష్‌ ప్రజల కష్టాలు తీర్చేందుకు వస్తున్నాడు

by సూర్య | Fri, Jan 27, 2023, 02:09 PM

సకల జనుల సౌఖ్యం కోసమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని పార్టీ సీనియర్‌ నాయకుడు వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి) అన్నా రు. లోకేష్‌ పాదయాత్ర విజయవంతం కావాలని కనిగిరి పట్ట ణంలోని రామా లయం, బొడ్డు చావిడిలోని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...  వైసీపీ పాలనలో నెలకొన్న ప్రజా సమస్యలపై గళమెత్తడానికి లోకేష్‌ ఏడాదికి పైగా పాదయాత్రకు సిద్ధమవడం గొప్ప విషయమన్నారు. నాడు జగన్‌రెడ్డి పదవీకాంక్ష కోసం పాద యాత్ర చేస్తే, నేడు లోకేష్‌ ప్రజల కష్టాలు తీర్చేందుకు వస్తున్నారన్నారు. లోకేష్‌ పాదయాత్ర ఎటువంటి అడ్డంకులు, ఆపదలు లేకుండా విజయవంతం కావాలని దేవున్ని వేడుకున్నారు. నియోజకవర్గ క్లస్టర్‌ ఇన్‌చార్జి దొడ్డా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జగన్‌రెడ్డి పాదయాత్రను అడ్డుకునేందుకు ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ప్రజాభిమానం, వారి దీవెనలతో యాత్ర కొనసాగుతుందన్నారు. ముందుగా అమరావతి గ్రౌండ్స్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.

Latest News

 
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM
ప్రజల సొమ్మును పరోక్షంగా టీడీపీ నేతలు దోచుకున్నారు Fri, Apr 26, 2024, 02:14 PM