గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

by సూర్య | Fri, Jan 27, 2023, 02:00 PM

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని సత్యవాడ శివారు ఈస్టు ఖండ్రికకు చెందిన పల్నాటి రాంబాబు(28) గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పామర్రు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంబాబు బుధవారం రాత్రి ఇంటి దగ్గర నుంచి బయటకువెళ్లి తిరిగిరాలేదు.గురువారం ఉదయం సుందరపల్లి వద్ద గోదావరి నదిలో అతని మృతదేహం కనిపించింది. రాంబాబుకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు. బైక్‌, సెల్‌ఫోను గోదావరి ఒడ్డున దొరికాయి. తాను చనిపోతున్నానని బైకు, సెల్‌ఫోను తీసుకువెళ్లమని స్నేహితులకు మెసేజ్‌ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. రాంబాబు మేనమామ అడపా శ్రీనివాసు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. కె.చిరంజీవి చెప్పారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM