by సూర్య | Fri, Jan 27, 2023, 01:59 PM
జనసేన సిద్ధాంతాలను, అధినేత పోరాట పటిమను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తూర్పు గోదావరి జిల్లా, పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. అనపర్తిలోని స్వామి వివేకానంద సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రజా సమస్యలపై నిరంతం పోరాటం చేస్తూ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రావాడ నాగు, ఎన్ఆర్కె ప్రసాదరెడ్డి, చైతన్యరెడ్డి పాల్గొన్నారు.
Latest News