భద్రాద్రిలో ఘనంగా రెండోరోజు వాగ్గేయకారోత్సవాలు
by సూర్య |
Fri, Jan 27, 2023, 01:30 PM
భక్తరామదాసు 390వ జయంతి సందర్భంగా భద్రాద్రి రామాలయంలో నిర్వహిస్తున్న వాగ్గేయకారోత్సవాలు రెండోరోజూ గురువారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబు, ఆయన కుమారుడు రవికుమార్, దేవస్థానం స్థానాచార్యులు ఆలపించిన భక్తరామదాసు, తూము నరసింహదాసు కీర్తనలు భక్తులను అలరించాయి. అలాగే హైదరాబాద్కు చెందిన లలిత విజయకుమార్, శ్రీనగరం లావణ్యలత, ఎస్సీ కౌశిక్ కల్యాణ్, వైష్ణవి ఆనంద్, శివశ్రీ స్కంద బృందం చెన్నై వారు భక్తరామదాసు కీర్తనలను ఆపలించారు. అలాగే కొత్తపల్లి వందన, కల్యాణ్ వసంత, ధూళిపాల వాసవి, శ్రీరంజని వైష్ణవిలు, లహరి కొలచెల, విజ్జి సోమనాథ్తో పాటు దేవస్థానం నాదస్వర బృందం భక్తి సంగీత కీర్తనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
Latest News