యువ గళం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించడం ఖాయం

by సూర్య | Fri, Jan 27, 2023, 12:16 PM

యువ గళం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించడం ఖాయమని మండల టీడీపీ నాయకులు అన్నారు. ఈ నెల 27 న కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్లు నారా లోకేష్ గ చేపడుతున్న పాదయాత్ర ఈ ప్రభుత్వానికి అంతిమయాత్ర గా మారుతుంది అని వారు అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలను చైతన్య వంతం చేయడమే పాదయాత్ర లక్ష్యం అని అన్నారు. 42 నెలల ఈ ప్రభుత్వ పాలన రాష్ట్రానికి శాపంగా మారి అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని వారు అన్నారు. దగా పడిన ప్రజలకు బాసటగా నిలిచి భవిష్యత్ మీద భరోసా కల్పించడమే పాదయాత్ర లక్ష్యం అని అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Latest News

 
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM