మొన్నటి వరకు ఉద్యోగుల కోత...తాజాగా జీతాల్లో కోత

by సూర్య | Wed, Jan 25, 2023, 11:36 PM

ఖర్చులను తగ్గించుకొనే క్రమంలో ఉద్యోగాలకు కోత పెట్టిన గూగుల్ సంస్థ తాజాగా తన ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతోంది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్, టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 6 శాతం మంది అంటే 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వ్యయ నియంత్రం చర్యల్లో భాగంగా సంస్థలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఉన్నత స్థాయిల్లో ఉన్న ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత విధిస్తున్నట్లు ప్రకటించారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. సంస్థ చరిత్రలోనే భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేపట్టిన తర్వాత దానిపై మాట్లాడేందుకు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగుల జీతాల కోతపై ప్రకటన చేశారు. సంస్థ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా టాప్ ఎగ్జిక్యూటీవ్స్ జీతాల్లో కోత ఉండబోతున్నట్లు వెల్లడించారు.


'సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పై స్థాయిలోని ఉద్యోగులందరికీ వార్షిక బోనస్‌లో గణనీయమైన కోత ఉండబోతోంది. అలాగే సీనియర్ రోల్స్ లో ఉన్నవారికి పరిహారం సంస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.' అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నట్లు బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది. మరోవైపు.. ఉద్యోగాల తొలగింపు అనేది ప్రపంచవ్యాప్తంగా, మొత్తం కంపెనీలో ఉంటుందని గత శుక్రవారం ఉద్యోగులకు ఈ-మెయిల్ చేశారు సుందర్ పిచాయ్. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు, షేర్ హోల్డర్స్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్ సహా బోర్డ్ డైరెక్టర్స్ తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఉద్యోగాల తొలగింపునకు పూనుకున్నట్లు స్పష్టం చేశారు.


పెద్ద ఎత్తున ఉద్యోగులను గూగుల్ తొలగిస్తున్నట్లు ఇ-మెయిల్స్ పంపిన క్రమంలో సుందర్ పియాచ్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయనపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాత్రం ఎందుకు, పిచాయ్ ని సైతం తొలగించండి అంటూ సోషల్ మీడియాల్లో ట్వీట్లు చేశారు. అయితే, ఎవరిని తొలగించాలనే విషయంలో 750 మంది సీనియర్ లీడర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సుందర్ పిచాయ్ తో పాటు సంస్థలోని పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు.


Latest News

 
ఇంటికే పరిమితమైన జేసీ దివాకర్‌ రెడ్డి Fri, May 17, 2024, 02:02 PM
ఈసీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు Fri, May 17, 2024, 02:02 PM
వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు Fri, May 17, 2024, 02:01 PM
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు Fri, May 17, 2024, 02:00 PM
టీడీపీ గెలుస్తుందనే అక్కసుతోనే దాడులకు పాల్పడ్డారు Fri, May 17, 2024, 01:59 PM