స్థానికుల ఫిర్యాదుతో బయటకు వచ్చిన గంజాయి బగోతం

by సూర్య | Wed, Jan 25, 2023, 08:58 PM

గట్టుచపుడు కాకుండా ఇంటి వెనకున్న పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతున్న యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. మొక్కలు పెంచేందుకు సాయం చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం మన్నెగుంట గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన.


గ్రామానికి చెందిన వెంకయ్య అనే వ్యక్తి, స్నేహితుడు ప్రతాప్ సాయంతో తన పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. పెరట్లోని మిగతా మొక్కల మధ్య ఉండడంతో ఎవరికీ తెలియదని అనుకున్నాడు. అయితే, మొక్క కాస్త పెరిగాక వెంకయ్య ఇంటి నుంచి వింత వాసన రావడం మొదలైంది. రోజుల తరబడి వాసన అలాగే వస్తుండడంతో గ్రామస్థులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వెంకయ్య ఇంట్లో సోదాలు చేయగా.. పెరట్లో పెంచుతున్న నాలుగు గంజాయి మొక్కల సంగతి బయటపడింది.


గంజాయి మొక్కలు సుమారు ఏడు అడుగుల వరకు పెరిగాయని, గంజాయి దాదాపు 2 కేజీల బరువు ఉంటుందని పోలీసులు చెప్పారు. గంజాయి మొక్కలను పెంచినా, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.


Latest News

 
తన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ Thu, Jun 08, 2023, 10:45 PM
వాయిదా పడిన సీఎం జగన్‌ గుడివాడ పర్యటన Thu, Jun 08, 2023, 10:08 PM
ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం Thu, Jun 08, 2023, 10:02 PM
నేడు సీఎం జగన్ ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు Thu, Jun 08, 2023, 09:26 PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8గా ఎంపీ అవినాష్ రెడ్డి Thu, Jun 08, 2023, 09:21 PM